నొప్పులు తగ్గించే తర్బూజ
ABN , Publish Date - Mar 06 , 2024 | 05:01 AM
తర్బూజ పండులో పోషకాలు అనేకం. ఇందులో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కడుపు త్వరగా నిండినట్లు అనిపిస్తుంది. ఇది తిన్నాక ఆకలి వేయదు. నీటిశాతం ఎక్కువే. ముఖ్యంగా ఈ పండులోని

తర్బూజ పండులో పోషకాలు అనేకం. ఇందులో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కడుపు త్వరగా నిండినట్లు అనిపిస్తుంది. ఇది తిన్నాక ఆకలి వేయదు. నీటిశాతం ఎక్కువే. ముఖ్యంగా ఈ పండులోని పొటాషియం కొవ్వును తగ్గిస్తుంది. జీర్ణక్రియను సాఫీగా ఉంచుతుంది.
తర్బూజ పండు తినటం వల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. తద్వారా టెన్షన్ తగ్గి నిద్ర పడుతుంది.
ఈ జ్యూస్ తాగటం వల్ల చక్కెరశాతం పెరగదు. పైగా కిడ్నీలోని రాళ్లు
కరిగిపోతాయి.
విటమిన్ సి,ఎ ఉండటం వల్ల ఇదో అద్భుతమైన ఇమ్యూనిటి బూస్టర్లా
పని చేస్తుంది. జలుబు, దగ్గులాంటివి దరి చేరవు.
కంటికి ఎంతో మేలు చేసే పండు తర్బూజ.
బరువు ఎక్కువగా ఉండే వాళ్లు తర్భూను డైట్లో ఉంచుకుంటే బరువు
తగ్గుతారు. అంతెందుకూ వీటి విత్తనాలు కూడా ఫైబర్ను కలిగి ఉండటం వల్ల డీహైడ్రేషన్ సమస్యనుంచి కాపాడుతుంది.
సాయంత్రం స్నాక్స్గా ఎండాకాలం తినొచ్చు. ఈ పండును తింటే
రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. రక్తపోటు లాంటివి కనపడవు.
దీనివల్ల గుండె ఆరోగ్యానికి మంచి జరుగుతుంది.
తర్బూజ పండు తినటం వల్ల కొల్లాజిన్ ఉత్పత్తి జరుగుతుంది.
జుట్టు పెరుగుతుంది. ముఖ్యంగా ఈ పండ్లతో ఫేస్ప్యాక్ వేసుకుంటే చర్మం మృదువుగా ఉంటుంది.
యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు ఇందులో ఉండటం వల్ల కీళ్లు, మోకాళ్లు, చేతి మెడిమలు దగ్గర నొప్పులు వచ్చే అవకాశం తక్కువ.
పండు తినని వాళ్లు రసం, సలాడ్స్తో తినొచ్చు. ఈ పండు తినటం వల్ల దంతాల నొప్పులు తగ్గిపోతాయి. 2016 అఽధ్యయనం ప్రకారం పంటి నొప్పిని తగ్గించే శక్తి ఈ పండుకు ఉందని పరిశోధకులు తేల్చారు.
ఫోలిక్ యాసిడ్ ఉండటం వల్ల గర్భిణిలు కూడా తినొచ్చు. దీనివల్ల బిడ్డ ఎదగటానికి ఉపయోగపడుతుంది.