అభిషేక్ పోస్ట్ ఐశ్వర్య గురించేనా?..
ABN , Publish Date - Jan 28 , 2024 | 12:17 AM
సోషల్ మీడియా పుణ్యమా అని చిన్న హింట్ దొరికితే చాలు, వార్తలు రాసేయడం కొందరు నెటిజన్స్కి పరిపాటైపోయింది. చేతిలో ఫోన్ ఉన్న ప్రతివాడూ ఇప్పుడు జర్నలిస్టే అన్నట్టు తయారైంది ప్రపంచం. అభిషేక్, ఐశ్వర్య వైవాహిక సంబంధంపై గత కొన్ని
![అభిషేక్ పోస్ట్ ఐశ్వర్య గురించేనా?..](https://media.andhrajyothy.com/media/2023/20231205/aish_abhishek_c2b1c8d540.jpg)
సోషల్ మీడియా పుణ్యమా అని చిన్న హింట్ దొరికితే చాలు, వార్తలు రాసేయడం కొందరు నెటిజన్స్కి పరిపాటైపోయింది. చేతిలో ఫోన్ ఉన్న ప్రతివాడూ ఇప్పుడు జర్నలిస్టే అన్నట్టు తయారైంది ప్రపంచం. అభిషేక్, ఐశ్వర్య వైవాహిక సంబంధంపై గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తూనేవున్నాయి. వాళ్లు విడివిడిగా బతుకుతున్నారనీ, లీగల్గా తెగతెంపులు చేసుకోవడమే ఆలస్యం అనీ.. రకరకాలుగా వార్తలు సోషల్మీడియా వండి వారుస్తోంది. వాటన్నింటినీ బ్రేక్ చేస్తూ ఇటీవలే తన కుమార్తె స్కూల్ ఫంక్షన్కి హాజరయ్యారు ఐశ్వర్యరాయ్. అలాగే ప్రో కబడ్డీ ఈవెంట్కి తన మామ అమితాబ్తో కలిసి హాజరై నెటిజన్స్ నోళ్లు మూయించారామె. ఇదిలావుంటే.. ఇటీవల ఓ ప్రైవేటు వేడుకకు హాజరైన అభిషేక్, తన పెళ్లి ఉంగరం లేకుండా కనిపించారు. దాంతో ఇప్పుడది కొత్త చర్చకు దారితీసింది. ఎప్పుడూ ఉంగరంతో కనిపించే అభిషేక్ ఇప్పుడు ఉంగరం లేకుండా ఎందుకు బయటకొచ్చారంటూ వార్తలు రాయడం మొదలుపెట్టారు. దీనికి ఆజ్యం పోస్తూ.. తన ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టాడు అభిషేక్. ‘ పరాజయం కలలను నాశనం చేస్తుంది.. కానీ ఆ ఓటమిని గుణపాఠంగా తీసుకుని ముందుకెళ్తే, కలలు నిజమవుతాయ్’ అనేది ఆ పోస్ట్ సారాంశం. ఈ పోస్ట్ కూడా ఐశ్వర్యను దృష్టిలో పెట్టుకొనే అభిషేక్ పెట్టాడని కొందరి వాదన. మరి వీటికి బ్రేక్ ఎప్పుడు పడుతుందో చూడాలి.