సున్నిత సమాచారం షేర్ కాకుండా..?
ABN , Publish Date - Apr 26 , 2024 | 11:51 PM
ఆండ్రాయిడ్ 14 వరకు ఇకపై స్ర్కీన్ షేరింగ్లో హ్యాకర్ల బారిన పడకుండా ఉండొచ్చు. ముఖ్యంగా సెన్సిటివ్ సమాచారం షేర్ కాకుండా
ఆండ్రాయిడ్ 14 వరకు ఇకపై స్ర్కీన్ షేరింగ్లో హ్యాకర్ల బారిన పడకుండా ఉండొచ్చు. ముఖ్యంగా సెన్సిటివ్ సమాచారం షేర్ కాకుండా చూసుకోవచ్చు. మొత్తమ్మీద దీన్నో శక్తిమంతమైన ఫీచర్గా చెప్పవచ్చు. ఈ ఏడాది మధ్యలో రాబోయే వెర్షన్లో ఈ ఫీచర్ ఉంటుందని భావిస్తున్నారు. పాస్వర్డ్స్, సెన్సిటివ్ నోటిఫికేషన్స్ డిస్ప్లే కాకుండా గూగుల్ చర్యలు తీసుకోనుంది. ‘ఆండ్రాయిడ్ పోలీస్’ రిపోర్ట్ ప్రకారం లేటెస్ట్ ఆండ్రాయిడ్ బేటా 1.1లో ‘డిజేబుల్ స్ర్కీన్ షేర్ ప్రొటెక్షన్’ పేరిట ఈ సమాచారం ఉంది. అయితే ఇంకా ఇది ఎనేబుల్ కావాల్సి ఉంది. అంటే ఇంకా టెస్టర్ల చేతికి రాలేదు.