Share News

మళ్లీ మణుగూరు ప్యాసింజర్‌ నడపాలి

ABN , Publish Date - May 08 , 2024 | 12:13 AM

తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మణుగూరు నుంచి కాజీపేటకు నడిచే మణుగూరు ప్యాసింజర్‌ రైలు గ్రామీణ, పట్టణ ప్రయాణికులకు అనుకూలంగా ఉండేది...

మళ్లీ మణుగూరు ప్యాసింజర్‌ నడపాలి

తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మణుగూరు నుంచి కాజీపేటకు నడిచే మణుగూరు ప్యాసింజర్‌ రైలు గ్రామీణ, పట్టణ ప్రయాణికులకు అనుకూలంగా ఉండేది. కరోనా వైరస్ ప్రారంభం కాకముందు నడిచిన ఈ రైలును తిరిగి ప్రయాణికుల సౌకర్యార్థం పునః ప్రారంభించాలని రైల్వే అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రైలు మణుగూరు, కొత్తగూడెం, డోర్నకల్, మహబూబాబాద్, కేసముద్రం, నెక్కొండ, వరంగల్, కాజీపేట స్టేషన్ల నుంచి ప్రయాణించే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లతో సమానంగా ప్యాసింజర్ రైళ్లకు కూడా ప్రయాణ చార్జీలను పెంచారు. మణుగూరు ప్యాసింజర్‌ రైలు ప్రయాణ చార్జీలను కూడా గతంలో ఉన్నట్లుగానే తగ్గించాలి.

ఈదునూరి వెంకటేశ్వర్లు

నెక్కొండ

Updated Date - May 08 , 2024 | 12:13 AM