క్రూడాయిల్పై విండ్ఫాల్ ట్యాక్స్ పెంపు
ABN , Publish Date - Jan 03 , 2024 | 01:46 AM
దేశంలో ఉత్పత్తి అయ్యే ముడి చమురుపై విధించే విండ్ఫాల్ ట్యాక్స్ను ప్రభుత్వం మరింత పెంచింది. ఇప్పటి వరకు టన్నుకు రూ.1,300గా ఉన్న...
![క్రూడాయిల్పై విండ్ఫాల్ ట్యాక్స్ పెంపు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
న్యూఢిల్లీ: దేశంలో ఉత్పత్తి అయ్యే ముడి చమురుపై విధించే విండ్ఫాల్ ట్యాక్స్ను ప్రభుత్వం మరింత పెంచింది. ఇప్పటి వరకు టన్నుకు రూ.1,300గా ఉన్న ఈ ట్యాక్స్ను రూ.2,300కు పెంచింది. డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతులపై ఉన్న విండ్ఫాల్ ట్యాక్స్ను పూర్తిగా ఎత్తివేసింది. పెట్రోల్ ఎగుమతులపై ఉన్న నిల్ డ్యూటీని యథాతథంగా ఉంచింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆయిల్ కంపెనీల అసాధారణ లాభాలపై ఇతర దేశాల్లా మన దేశం కూడా విండ్ఫాల్ ట్యాక్స్ విధిస్తోంది. ఈ పెంపు, సవరణలు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి.