జీ-సోనీ విలీనం కథ కంచికి!
ABN , Publish Date - Jan 09 , 2024 | 02:59 AM
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జీ)లో సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విలీనం కథ కంచికి చేరుతున్నట్టు సమాచారం...
![జీ-సోనీ విలీనం కథ కంచికి!](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ముంబై: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జీ)లో సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విలీనం కథ కంచికి చేరుతున్నట్టు సమాచారం. విలీనం తర్వాత ఏర్పడే కొత్త కంపెనీకి జీ నెట్వర్క్ ప్రమోటర్ సుభాష్ చంద్ర కుమారుడు పునీత్ గోయెంకా సీఈఓ కావడాన్ని సోనీ వ్యతిరేకిస్తోంది. జీలో ఆయన అక్రమాలపై సెబీ దర్యాప్తు జరుపుతున్నందున గోయెంకాను ఎట్టిపరిస్థితుల్లోనూ విలీన కంపెనీకి సీఈఓగా అంగీకరించే ప్రసక్తే లేదని సోనీ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ విలీనం ద్వారా దాదాపు 1,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.83,200 కోట్లు) మీడియా దిగ్గజం ఏర్పడుతుందని భావించారు. అయితే తాజా పరిణామాలతో ఆ ఆశలు సన్నగిల్లుతున్నాయి.