రిలయన్స్ కాపిటల్ కథ మళ్లీ మొదటికి !
ABN , Publish Date - Apr 08 , 2024 | 05:49 AM
దివాలా ప్రక్రియలో ఉన్న రిలయన్స్ కాపిటల్ కథ ఇప్పట్లో తేలేలా లేదు. రూ.9,650 కోట్లతో ఈ కంపెనీని టేకోవర్ చేసేందుకు హిందుజా గ్రూప్ సంస్థ...
న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియలో ఉన్న రిలయన్స్ కాపిటల్ కథ ఇప్పట్లో తేలేలా లేదు. రూ.9,650 కోట్లతో ఈ కంపెనీని టేకోవర్ చేసేందుకు హిందుజా గ్రూప్ సంస్థ ఇండ్సఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఐఐహెచ్ఎల్) ఈ ఏడాది ఫిబ్రవరిలో వేసిన బిడ్కు ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది. అయితే రిలయన్స్ కాపిటల్ నిర్వహణలోని నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థకు అవసరమైన మూల ధనం, రుణాలను ఐఐహెచ్ఎల్ ఎలా సేకరిస్తోందో తెలపాలని బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ కోరింది. దీంతో రిలయన్స్ కాపిటల్ దివాలా పరిష్కార కథ మళ్లీ మొదటికొచ్చినట్టయింది.