కర్ణాటకలో టాటాల రూ.2,300 కోట్ల పెట్టుబడి
ABN , Publish Date - Feb 20 , 2024 | 04:31 AM
కర్ణాటకలో చేపట్టనున్న పలు కొత్త ప్రాజెక్టుల్లో టాటాల సారథ్యంలోని ఎయిరిండియా, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎ్సఎల్) రూ.2,300 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి...
![కర్ణాటకలో టాటాల రూ.2,300 కోట్ల పెట్టుబడి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
బెంగళూరు: కర్ణాటకలో చేపట్టనున్న పలు కొత్త ప్రాజెక్టుల్లో టాటాల సారథ్యంలోని ఎయిరిండియా, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎ్సఎల్) రూ.2,300 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. ఈ ప్రాజెక్టులు 1,650 మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తాయి. ఈ మేరకు ఉభయ సంస్థలు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మధ్యశ్రేణి పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ సమక్షంలో ఎంఓయూలపై సంతకాలు చేశాయి.