సైయెంట్ లాభంలో స్వల్ప వృద్ధి
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:25 AM
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో సైయెంట్ లిమిటెడ్ రూ.177 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం స్వల్పంగా 2.3 శాతం పెరిగింది...

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో సైయెంట్ లిమిటెడ్ రూ.177 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం స్వల్పంగా 2.3 శాతం పెరిగింది. త్రైమాసిక సమీక్షా కాలంలో కంపెనీ మొత్తం రెవెన్యూ మాత్రం 1.8 శాతం క్షీణించి రూ.1,450 కోట్లుగా నమోదైంది. కరెన్సీలో హెచ్చుతగ్గుల కారణంగా రెవెన్యూ స్వల్పంగా తగ్గిందని కంపెనీ పేర్కొంది.