Share News

సిగ్నిటీ కన్సాలిడేటెడ్‌ లాభం రూ.48 కోట్లు

ABN , Publish Date - Feb 07 , 2024 | 05:16 AM

సిగ్నిటీ టెక్నాలజీస్‌ కన్సాలిడేటెడ్‌ లాభం వర్తమాన ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో 9.4 శాతం వృద్ధితో రూ.468.02 కోట్లుగా నమోదయింది...

సిగ్నిటీ కన్సాలిడేటెడ్‌ లాభం రూ.48 కోట్లు

హైదరాబాద్‌: సిగ్నిటీ టెక్నాలజీస్‌ కన్సాలిడేటెడ్‌ లాభం వర్తమాన ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో 9.4 శాతం వృద్ధితో రూ.468.02 కోట్లుగా నమోదయింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన ఆదాయం రూ.427.99 కోట్లు. కన్సాలిడేటెడ్‌ లాభం 3.2 శాతం వృద్ధితో రూ.46.55 కోట్ల నుంచి రూ.48.04 కోట్లకు పెరిగింది. ఇదే తేదీతో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో కంపెనీ ఆదాయం 11.2 శాతం పెరిగి రూ.1222.61 కోట్ల నుంచి రూ.1359.37 కోట్లకు చేరగా లాభం 16.3 శాతం పెరిగి రూ.119.08 కోట్ల నుంచి రూ.138.46 కోట్లుగా నమోదయింది. ఎన్నో సవాళ్లను తట్టుకుని కూడా తాము మంచి ఆర్థిక ఫలితాలు సాధించినట్టు కంపెనీ సీఈఓ శ్రీకాంత్‌ చక్కిలం తెలిపారు.

Updated Date - Feb 07 , 2024 | 07:06 AM