హిందుజాల చేతికి రిలయన్స్ క్యాపిటల్
ABN , Publish Date - Feb 28 , 2024 | 03:19 AM
రిలయన్స్ క్యాపిటల్ (ఆర్ క్యాప్) దివాలా ప్రక్రియ కొలిక్కి వస్తోంది. అనిల్ అంబానీ గ్రూప్ అడాగ్ ప్రమోట్ చేసిన ఈ కంపెనీ ఆస్తులు, వ్యాపారం కొనుగోలు కోసం హిందుజా గ్రూప్...
![హిందుజాల చేతికి రిలయన్స్ క్యాపిటల్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ముంబై: రిలయన్స్ క్యాపిటల్ (ఆర్ క్యాప్) దివాలా ప్రక్రియ కొలిక్కి వస్తోంది. అనిల్ అంబానీ గ్రూప్ అడాగ్ ప్రమోట్ చేసిన ఈ కంపెనీ ఆస్తులు, వ్యాపారం కొనుగోలు కోసం హిందుజా గ్రూప్ కంపెనీ ఇండ్సఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్) గత ఏడాది జూన్లో సమర్పించిన రూ.9,650 కోట్ల బిడ్ను ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఆమోదించింది. కంపెనీ రుణదాతలు కూడా ఇందుకు ఆమోదం తెలిపారు. దీంతో వారికి రావలసిన రూ.38,526.42 కోట్ల బకాయిల్లో రూ.9.661 కోట్లు (37 శాతం) మాత్రమే వసూలు కానున్నాయి. డీహెచ్ఎ్ఫఎల్ తర్వాత ఎన్సీఎల్టీ దివాలా ప్రక్రియకు వచ్చిన రెండో ఎన్బీఎ్ఫసీ ఆర్ క్యాప్ మాత్రమే.