ఇండోఫాస్ట్ ఎనర్జీతో రాపిడో భాగస్వామ్యం
ABN , Publish Date - Oct 24 , 2024 | 01:25 AM
దేశంలోని ప్రధాన నగరాల్లో పియాజియో స్వాపబుల్ విద్యుత్ త్రీ వీలర్లు ప్రవేశపెట్టడానికి ఇండోఫాస్ట్ ఎనర్జీతో రాపిడో భాగస్వామ్య ఒప్పం దం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం కింద...
హైదరాబాద్: దేశంలోని ప్రధాన నగరాల్లో పియాజియో స్వాపబుల్ విద్యుత్ త్రీ వీలర్లు ప్రవేశపెట్టడానికి ఇండోఫాస్ట్ ఎనర్జీతో రాపిడో భాగస్వామ్య ఒప్పం దం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం కింద రాబోయే 24 నెలల కాలంలో వివిధ నగరాల్లో 10 వేల ఈ-సిటీ మ్యాక్స్ త్రీవీలర్లు ప్రవేశపెడతారు. హైదరాబాద్, బెంగళూరు నుంచి దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాలన్నింటికీ ఈ భాగస్వామ్యం విస్తరిస్తుంది. ఇండోఫా్స్టతో భాగస్వామ్యం వల్ల తాము ఈవీ ప్లాట్ఫారం విస్తరించేందుకు వీలు కలుగుతుందని రాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి అన్నారు.