Share News

రూ.40 కోట్లతో హైదరాబాద్‌లో రెయిన్‌బో కొత్త ఆసుపత్రి

ABN , Publish Date - Jan 05 , 2024 | 06:22 AM

రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ హైదరా బాద్‌లో మరో ఆసుపత్రిని ప్రారంభించింది. రూ.40 కోట్ల ఏర్పాటు చేసిన కొత్త ఆసుపత్రిలో 60 పడకలు ఉంటాయని...

రూ.40 కోట్లతో హైదరాబాద్‌లో రెయిన్‌బో కొత్త ఆసుపత్రి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ హైదరా బాద్‌లో మరో ఆసుపత్రిని ప్రారంభించింది. రూ.40 కోట్ల ఏర్పాటు చేసిన కొత్త ఆసుపత్రిలో 60 పడకలు ఉంటాయని, దీంతో రెయిన్‌బో, దాని అనుబంధ కంపెనీల మొత్తం పడకల సామర్థ్యం 1,715 పడకల స్థాయికి చేరుతుందని కంపెనీ వెల్లడిం చింది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులతో హైదరాబాద్‌లోని హిమాయత్‌ నగర్‌లో ఈ కొత్త ఆసుపత్రిని ప్రారంభించారు. ఇది హైదరాబాద్‌లో రెయిన్‌బోకు 8వ ఆసుపత్రి. కాగా వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఎన్‌సీఆర్‌, ఆంధ్ర ప్రదేశ్‌, తమిళనాడుల్లోని ద్వితీయ శ్రేణి నగరాల్లో మొత్తం 1,000 పడకలను అదనంగా సమకూర్చుకోవాలని రెయిన్‌బో భావిస్తోంది.

Updated Date - Jan 05 , 2024 | 06:22 AM