ఎన్హెచ్పీసీ, ఎస్జేవీఎన్కు నవరత్న హోదా
ABN , Publish Date - Aug 31 , 2024 | 06:37 AM
ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్హెచ్పీసీ), సట్లేజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (ఎస్జేవీఎన్), సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఈసీఐ)లకు కేంద్ర ప్రభుత్వం నవ రత్న
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్హెచ్పీసీ), సట్లేజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (ఎస్జేవీఎన్), సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఈసీఐ)లకు కేంద్ర ప్రభుత్వం నవ రత్న హోదాను ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్హెచ్పీసీ, ఎస్జేవీఎన్లకు ఇప్పటికే మినీ నవరత్న హోదా ఉండగా తాజాగా ప్రభుత్వం నవరత్న హోదాను ఇచ్చింది.