ఎన్ఎండీసీకి మారుత్ డ్రోన్లు
ABN , Publish Date - Jan 31 , 2024 | 01:13 AM
డ్రోన్ల తయారీలో అగ్రగామి అయిన మారుత్ డ్రోన్స్.. ప్రభుత్వ రంగంలోని ఎన్ఎండీసీకి డ్రోన్ ఆధారిత ఖనిజాన్వేషణ చేపట్టడానికి డ్రోన్లు సరఫరా చేసింది. మారుత్ డ్రోన్స్ నుంచి...
హైదరాబాద్: డ్రోన్ల తయారీలో అగ్రగామి అయిన మారుత్ డ్రోన్స్.. ప్రభుత్వ రంగంలోని ఎన్ఎండీసీకి డ్రోన్ ఆధారిత ఖనిజాన్వేషణ చేపట్టడానికి డ్రోన్లు సరఫరా చేసింది. మారుత్ డ్రోన్స్ నుంచి రెండు కస్టమైజ్డ్ ఆక్టాకాప్టర్ డ్రోన్లు సేకరించినట్టు ఎన్ఎండీసీ ప్రకటించింది. ఈ డ్రోన్లకు మాగ్నెటోమీటర్, హైపర్ స్పెక్ట్రల్, లిడార్ వంటి ఆధునిక సెన్సర్లుంటాయి. దీని వల్ల ఖనిజాన్వేషణ సామర్థ్యాలు పెరుగుతాయి. కచ్చితమైన మ్యాపిం గ్, అన్వేషణకు ఇవి సహాయపడతాయని మారుత్ డ్రోన్స్ సీఈఓ ప్రేమ్కుమార్ విస్లావత్ తెలిపారు.