అత్యంత విలువైన పీఎస్యూగా ఎల్ఐసీ
ABN , Publish Date - Jan 18 , 2024 | 05:24 AM
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా, దేశంలో అత్యంత విలువైన ప్రభుత్వ రంగ కంపెనీ (పీఎ్సయూ) జాబితాలో ఎస్బీఐని వెనక్కి నెట్టి ఎల్ఐసీ అగ్రస్థానానికి ఎగబాకింది. ప్రారంభ ట్రేడింగ్లో ఎల్ఐసీ షేరు 3 శాతం పెరిగి...
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా, దేశంలో అత్యంత విలువైన ప్రభుత్వ రంగ కంపెనీ (పీఎ్సయూ) జాబితాలో ఎస్బీఐని వెనక్కి నెట్టి ఎల్ఐసీ అగ్రస్థానానికి ఎగబాకింది. ప్రారంభ ట్రేడింగ్లో ఎల్ఐసీ షేరు 3 శాతం పెరిగి రూ.919.45 వద్ద సరికొత్త ఏడాది గరిష్ఠాన్ని రికార్డు చేసింది. దాంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.5.75 లక్షల కోట్లకు ఎగబాకింది. అదే సమయంలో ఎస్బీఐ షేరు నష్టాల్లో ట్రేడైంది. దాంతో బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.5.60 లక్షల కోట్లకు పరిమితమైంది. చివర్లో ఎల్ఐసీ షేరు నష్టాల్లోకి జారుకున్నప్పటికీ, కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.5.61 లక్షల కోట్లుగా నమోదు కావడంతో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగలిగింది.