ఐవీఎంఏ ప్రెసిడెంట్గా కృష్ణ ఎల్లా
ABN , Publish Date - Apr 30 , 2024 | 06:14 AM
‘ది ఇండియన్ వ్యాక్సిన్ మాన్యుఫాక్చరర్స్ అసోసిఏషన్’ (ఐవీఎంఏ) కీలక పదవులకు ముగ్గురు తెలుగు తేజాలు ఎన్నికయ్యారు...
![ఐవీఎంఏ ప్రెసిడెంట్గా కృష్ణ ఎల్లా](https://media.andhrajyothy.com/media/2024/20240428/9_Business_a5ef421433.jpg)
వైస్ ప్రెసిడెంట్గా మహిమ దాట్ల
హైదరాబాద్: ‘ది ఇండియన్ వ్యాక్సిన్ మాన్యుఫాక్చరర్స్ అసోసిఏషన్’ (ఐవీఎంఏ) కీలక పదవులకు ముగ్గురు తెలుగు తేజాలు ఎన్నికయ్యారు. భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎం ఎల్లా ప్రెసిడెంట్గా, బయోలాజికల్-ఈ (బీఈ) మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల వైస్ ప్రెసిడెంట్గా, భారత్ బయోటెక్ సీఎ్ఫఓ టీ శ్రీనివాస్ ట్రెజరర్గా ఎన్నికయ్యారు. వీరు రెండేళ్ల పాటు ఈ పదవుల్లో కొనసాగుతారు. ఐవీఎంఏ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ డాక్టర్ హర్షవర్ధన్ అదే పదవిలో కొనసాగుతారు. ‘అంతర్జాతీయ ఆరోగ్యానికి వ్యాక్సిన్లు ప్రధాన మూలస్తంభాలు. ఎవరు ఎక్కడ నివసిస్తున్నారనే దానిపై సంబంధం లేకుండా, ప్రతి వ్యక్తికీ వ్యాధి నిరోధక టీకాలు అందుబాటులో ఉండాలన్నదే ఐవీఎంఏ ధ్యేయం’ అని కృష్ణ ఎం ఎల్లా ఒక ప్రకటనలో తెలిపారు.