రూ.9,000 లోపే జియో 5జీ ఫోన్!
ABN , Publish Date - Feb 28 , 2024 | 03:21 AM
ముకేశ్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ జియో చౌకగా 5జీ ఫోన్ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది...
![రూ.9,000 లోపే జియో 5జీ ఫోన్!](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ జియో చౌకగా 5జీ ఫోన్ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. అమెరికన్ చిప్ తయారీ దిగ్గజం క్వాల్కామ్తో కలిసి అభివృద్ధి చేస్తున్న ఈ ఎంట్రీ లెవెల్ 5జీ జియో ఫోన్ను ఏడాది చివరినాటికి మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలున్నాయి. దీని ధర రూ.9,000 లోపే ఉండవచ్చని సమాచారం.