Share News

ఐటీ ఉద్యోగులే రిటైల్‌ రంగానికి చోదక శక్తి

ABN , Publish Date - Apr 25 , 2024 | 05:29 AM

హైదరాబాద్‌లో రిటైల్‌ రంగ అభివృద్ధికి ఐటీ ఉద్యోగులు ప్రదాన చోదక శక్తిగా మారారని రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌ఏఐ) సీఈఓ కుమార్‌ రాజగోపాలన్‌ అన్నారు...

ఐటీ ఉద్యోగులే రిటైల్‌ రంగానికి చోదక శక్తి

  • ఆర్‌ఏఐ సీఈఓ రాజగోపాలన్‌

హైదరాబాద్‌లో రిటైల్‌ రంగ అభివృద్ధికి ఐటీ ఉద్యోగులు ప్రదాన చోదక శక్తిగా మారారని రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌ఏఐ) సీఈఓ కుమార్‌ రాజగోపాలన్‌ అన్నారు. ఆర్‌ఏఐ నిర్వహించిన హైదరాబాద్‌ రిటైల్‌ సదస్సులో ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌ కొనుగోళ్ల సౌలభ్యంతో హైదరాబాద్‌ రిటైల్‌ మార్కెట్‌ స్వరూపమే మారిపోయిందన్నారు. ప్రస్తుతం ఖాతాదారులు 24 గంటల ఆన్‌లైన్‌ కొనుగోళ్ల సౌలభ్యంతో పాటు విశ్వసనీయమైన ఆఫ్‌లైన్‌ అనుభూతిని ఆశిస్తున్నట్టు రాజగోపాలన్‌ తెలిపారు. రిటైల్‌ కంపెనీలు కొత్త విషయాలు నేర్చుకోవడంపై ఆసక్తి చూపకపోతే రిటైల్‌ పరిశ్రమ వృద్ధి రేటుకు గండిపడుతుందని సదస్సుకు ప్రధాన అతిథిగా హాజరైన తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ అన్నారు. హైదరాబాద్‌ మంచి నివాసయోగ్యమైన నగరంగా మారడానికి రిటైల్‌ సంస్థలూ ఒక కారణమన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 05:29 AM