ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో సరికొత్త రికార్డు స్థాయికి సూచీలు
ABN , Publish Date - Mar 03 , 2024 | 01:51 AM
స్టాక్ మార్కెట్లో శనివారం నిర్వహించిన ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో ప్రామాణిక సూచీలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 249.35 పాయింట్ల వృద్ధితో...
ముంబై: స్టాక్ మార్కెట్లో శనివారం నిర్వహించిన ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో ప్రామాణిక సూచీలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 249.35 పాయింట్ల వృద్ధితో 73,994.70 వద్ద, నిఫ్టీ 80.8 పాయింట్ల పెరుగుదలతో 22,419.55 వద్ద ఆల్టైం ఇంట్రాడే రికార్డును నమోదు చేశాయి. చివరకు సెన్సెక్స్ 60.80 పాయింట్ల లాభంతో 73,806.15 వద్ద, నిఫ్టీ 39.65 పాయింట్ల లాభంతో 22,378.40 వద్ద క్లోజయ్యాయి. సూచీలకు సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయిలు కూడా ఇవే. భారీ అంతరాయాలు లేదా వైఫల్యాలను ఎదుర్కొనే విషయంలో తమ సంసిద్ధతను పరీక్షించుకునేందుకు బీఎ్సఈ, సెన్సెక్స్ ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్లలో ఈ ప్రత్యేక ట్రేడింగ్ను నిర్వహించాయి.