కరెన్సీ డెరివేటివ్స్ నిబంధనల అమలు మే 3కు వాయిదా
ABN , Publish Date - Apr 05 , 2024 | 02:18 AM
ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ కరెన్సీ డెరివేటివ్స్ (ఈటీసీడీ) నిబంధనల అమలును మే 3కు వాయిదా వేస్తున్నట్లు ఆర్బీఐ గురువారం ప్రకటించింది. మార్కెట్ వర్గాల నుంచి అందుకున్న సూచనలు, అభిప్రాయాలతో...
![కరెన్సీ డెరివేటివ్స్ నిబంధనల అమలు మే 3కు వాయిదా](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ కరెన్సీ డెరివేటివ్స్ (ఈటీసీడీ) నిబంధనల అమలును మే 3కు వాయిదా వేస్తున్నట్లు ఆర్బీఐ గురువారం ప్రకటించింది. మార్కెట్ వర్గాల నుంచి అందుకున్న సూచనలు, అభిప్రాయాలతో పాటు ఈ మధ్య చోటుచేసుకున్న పరిణామాల ఆధారంగా ఈ నిబంధనల అమలును ఆర్బీఐ నెల రోజుల పాటు వాయిదా వేసింది. మార్కెట్లో స్పెక్యులేటివ్ ట్రేడింగ్ను అరికట్టేందుకు ఆర్బీఐ కరెన్సీ డెరివేటివ్స్ నిబంధనలను కఠినతరం చేస్తూ జనవరి 5న సర్క్యులర్ జారీ చేసింది. దాని ప్రకారం కొత్త నిబంధనలు ఈ నెల 5 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది.