గ్రాన్యూల్స్ లాభం రూ.130 కోట్లు
ABN , Publish Date - May 16 , 2024 | 05:06 AM
స్థానిక ఫార్మా కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియా మార్చి త్రైమాసికంలో రూ.130 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది ఎనిమిది శాతం..
![గ్రాన్యూల్స్ లాభం రూ.130 కోట్లు](https://media.andhrajyothy.com/media/2024/20240511/9_Business_eed35034f5.jpg)
ఒక్కో షేరుపై రూ.1.5 డివిడెండ్
హైదరాబాద్: స్థానిక ఫార్మా కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియా మార్చి త్రైమాసికంలో రూ.130 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది ఎనిమిది శాతం ఎక్కువ. ఇదే కాలంలో కంపెనీ ఆదాయం మాత్రం రూ.1,195 కోట్ల నుంచి రూ.1,176 కోట్లకు పడిపోయింది. 2023-24 ఆర్థిక సంవత్సరం మొత్తానికి కంపెనీ నికర లాభం 22 శాతం తగ్గి రూ.405 కోట్లకు, టర్నోవర్ రూ.4,512 కోట్ల నుంచి రూ.4,506 కోట్లకు పడిపోయాయి. అయినా రూపాయి ముఖ విలువ ఉన్న ఒక్కో షేరుపై రూ.1.5 (150 శాతం) తుది డివిడెండ్ చెల్లించాలని డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.