Share News

Paytm: ఆ దెబ్బతో గూగుల్ పే, ఫోన్‌ పే‌లకు పెరిగిపోతున్న కస్టమర్స్.. ఎందుకంటే

ABN , Publish Date - Mar 06 , 2024 | 04:04 PM

పేటీఎంపై ఆర్బీఐ(RBI) నిషేధం విధించడంతో ఆ సంస్థ భారీ నష్టాలను చవిచూస్తోంది. 500 మిలియన్లకుపైగా డౌన్లోడ్లు కలిగిన పేటీఎం(Paytm)పై ఆంక్షలు పెరగడం, దాని షేర్లు పడిపోవడం, పేటీఎంలోని వివిధ కార్యకలాపాలు మార్చి నెలలో ఆగిపోతాయనే వార్తల నేపథ్యంలో కస్టమర్లు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు.

Paytm: ఆ దెబ్బతో గూగుల్ పే, ఫోన్‌ పే‌లకు పెరిగిపోతున్న కస్టమర్స్.. ఎందుకంటే

ఢిల్లీ: పేటీఎంపై ఆర్బీఐ(RBI) నిషేధం విధించడంతో ఆ సంస్థ భారీ నష్టాలను చవిచూస్తోంది. 500 మిలియన్లకుపైగా డౌన్లోడ్లు కలిగిన పేటీఎం(Paytm)పై ఆంక్షలు పెరగడం, దాని షేర్లు పడిపోవడం, పేటీఎంలోని వివిధ కార్యకలాపాలు మార్చి నెలలో ఆగిపోతాయనే వార్తల నేపథ్యంలో కస్టమర్లు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ఇందులో భాగంగా గూగుల్ పే, ఫోన్ పేవైపు ఆకర్షితులవుతున్నారు. యూపీఐ చెల్లింపుల్లో ఎప్పటి నుంచో పేటీఎం అగ్రస్థానంలో ఉంది. నిషేధం కారణంగా కస్టమర్లు ఇతర పేమెంట్ యాప్‌ల వైపు వెళ్తున్నారు.


పేటీఎం చెల్లింపుల విలువ జనవరి నుంచి ఇప్పటివరకు 14 శాతం తగ్గి 1.65 ట్రిలియన్ రూపాయలకు పడిపోయిందని నేషనల్ పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బుధవారం తన వెబ్ సైట్‌లో తెలిపింది. ఫోన్ పే, గూగుల్ పే రెండింటిలో పేటీఎం కంటే ఎక్కువ చెల్లింపులు జరిగాయి. PhonePe ద్వారా ప్రాసెస్ అయిన లావాదేవీల విలువ దాదాపు 7% పెరిగింది, GPayలో 6 శాతం లావాదేవీలు పెరిగాయని NPCI డేటా స్పష్టం చేసింది. మార్చి 15తో పేటీఎంలో చాలా ఫీచర్లు కనుమరుగు కానున్నాయి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 06 , 2024 | 04:04 PM