Share News

రూ.932కే విమాన టికెట్‌

ABN , Publish Date - Sep 11 , 2024 | 02:49 AM

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఫ్లాష్‌ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో విక్రయించే ఎక్స్‌ప్రెస్‌ లైట్‌ సర్వీసుల టికెట్ల ప్రారంభ ధర రూ.932గా ఉంది. ఈ నెల 16 వరకు సేల్‌ అందుబాటులో ఉంటుందని, 2025 మార్చి 31 వరకు...

రూ.932కే విమాన టికెట్‌

ఫ్లాష్‌ సేల్‌ ప్రకటించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్‌: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఫ్లాష్‌ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో విక్రయించే ఎక్స్‌ప్రెస్‌ లైట్‌ సర్వీసుల టికెట్ల ప్రారంభ ధర రూ.932గా ఉంది. ఈ నెల 16 వరకు సేల్‌ అందుబాటులో ఉంటుందని, 2025 మార్చి 31 వరకు ప్రయాణించేందుకు ఈ సేల్‌ ద్వారా టికెట్లను బుక్‌ చేసుకోవచ్చని ఎయిర్‌లైన్స్‌ స్పష్టం చేసింది. ఎక్స్‌ప్రెస్‌ వేల్యూ సర్వీసుల బుకింగ్స్‌కూ వర్తిస్తుందని, టికెట్‌ ధర రూ.1,088 నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించింది.

వచ్చే ఏడాది నుంచి బిజినెస్‌ కాస్ల్‌కు గుడ్‌బై : టాటా గ్రూప్‌ చేతుల్లోకి వెళ్లిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ వచ్చే సంవత్సరం నుంచి తమ విమానాల్లో బిజినెస్‌ క్లాస్‌ సీట్లను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి విమానాల సంఖ్యను 100కు పెంచుకోనుంది.

Updated Date - Sep 11 , 2024 | 02:49 AM