రూ.22 కోట్లతో పోల్మోర్ స్టీల్ విస్తరణ
ABN , Publish Date - Apr 19 , 2024 | 02:29 AM
పోలెండ్కు చెందిన పోల్మోర్ స్టీల్ కంపెనీ మెదక్ జిల్లాలోని తన ప్లాంట్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని మరింతగా విస్తరిస్తోంది. రూ.22.27 కోట్లతో చేపడుతున్న ఈ విస్తరణతో...
హైదరాబాద్: పోలెండ్కు చెందిన పోల్మోర్ స్టీల్ కంపెనీ మెదక్ జిల్లాలోని తన ప్లాంట్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని మరింతగా విస్తరిస్తోంది. రూ.22.27 కోట్లతో చేపడుతున్న ఈ విస్తరణతో అదనంగా మరో 100 మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని కంపెనీ ఎండీ కేవీఆర్ సుబ్బారావు వెల్లడించారు. మెదక్ జిల్లాలోని కాళ్లకల్, ముప్పిరెడ్డిపల్లి ఇండస్ట్రియల్ ప్రాంతంలోని ఆటోమోటివ్ పార్కులో ప్రస్తుతం ఈ ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్ పక్కనే ఉన్న మూడు ఎకరాల్లో ఈ విస్తరణ చేపడతామని సుబ్బారావు చెప్పారు. భారత్లోని పోలెండ్ రాయబారి డాక్టర్ సెబాస్టియన్ డొమ్జాల్స్కీ నాయకత్వంలోని పోలెండ్ ప్రతినిధుల బృందం కంపెనీ ప్లాంట్ను సందర్శించిన సందర్భంగా సుబ్బారావు ఈ విషయాలు వెల్లడించారు.