ఇంధనంపై ఎక్సైజ్ సుంకం తగ్గించాలి
ABN , Publish Date - Dec 30 , 2024 | 04:06 AM
వినియోగాన్ని ఉత్తేజితం చేయడానికి ఇంధనంపై ఎక్సైజ్ సుంకం తగ్గించాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రభుత్వానికి సూచించింది....
సీఐఐ
న్యూఢిల్లీ: వినియోగాన్ని ఉత్తేజితం చేయడానికి ఇంధనంపై ఎక్సైజ్ సుంకం తగ్గించాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రభుత్వానికి సూచించింది. ఇంధన ధరలే ద్రవ్యోల్బణం అదుపు తప్పడానికి కారణమని, ఫలితంగా అల్పాదాయ వర్గా ల వారు తీవ్రంగా ప్రభావితమవుతున్నారని పేర్కొం ది. అలాగే రూ.20 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారిపై వ్యక్తిగత ఆదాయపు పన్ను తగ్గించే విషయం కూడా పరిశీలించాలని, దానివల్ల కూడా వినియోగం పెరిగి అధిక పన్ను వసూళ్లు వస్తాయని సూచించింది. వ్యక్తిగత ఐటీ చెల్లింపుదారులపై గరిష్ఠ మార్జినల్ రేట్ 42.74ు ఉంటే సాధారణ కార్పొరేట్ పన్ను రేటు 25.17ు ఉన్నదని, ఈ వ్యత్యాసం తగ్గించాలని కోరింది.