Share News

హైదరాబాద్‌లో క్యాష్‌ఈ ఎక్సలెన్స్‌ సెంటర్‌

ABN , Publish Date - Jun 04 , 2024 | 04:25 AM

ఏఐ ఆధారిత ఫిన్‌టెక్‌ కంపెనీ క్యాష్‌ఈ హైదరాబాద్‌లో కొత్తగా టెక్నాలజీ ఎక్సలెన్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది...

హైదరాబాద్‌లో క్యాష్‌ఈ ఎక్సలెన్స్‌ సెంటర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఏఐ ఆధారిత ఫిన్‌టెక్‌ కంపెనీ క్యాష్‌ఈ హైదరాబాద్‌లో కొత్తగా టెక్నాలజీ ఎక్సలెన్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. డిజిటల్‌ ఇంజనీరింగ్‌ సామర్థ్యాలను విస్తరించటంలో భాగంగా ఈ సెంటర్‌ను నెలకొల్పుతున్నట్లు వెల్లడించింది. కాగా ప్రస్తుతం కంపెనీలో మొత్తం 550 ఉద్యోగులుండగా ఈ ఏడాది చివరి నాటికి కొత్తగా 300 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు క్యాష్‌ఈ తెలిపింది. ఇందులో 150 మంది ఉద్యోగులను హైదరాబాద్‌ కేంద్రం కోసం తీసుకోనుండగా మిగిలిన వారిని ముంబై కేంద్రంలో నియమించుకోనున్నట్లు పేర్కొంది.

Updated Date - Jun 04 , 2024 | 04:25 AM