కర్ణాటకలో ‘మేఘా’కు రూ.8,000 కోట్ల ప్రాజెక్ట్
ABN , Publish Date - Apr 30 , 2024 | 06:10 AM
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్)కు కర్ణాటకలో భారీ పవర్ ప్రాజెక్ట్ లభించింది...
![కర్ణాటకలో ‘మేఘా’కు రూ.8,000 కోట్ల ప్రాజెక్ట్](https://media.andhrajyothy.com/media/2024/20240428/bb_083a8f906b.jpg)
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్)కు కర్ణాటకలో భారీ పవర్ ప్రాజెక్ట్ లభించింది. శరావతి నదిపై 2,000 మెగావాట్ల సామర్ధ్యంతో నిర్మించే పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్ట్ కంపెనీకి దక్కింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.8,000 కోట్ల వరకు పెట్టుబడి అవసరమవుతుందని కంపెనీ తెలిపింది. ఇది దేశంలోనే అతిపెద్ద పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టు కానుంది. ఈ ప్రాజెక్ట్ కోసం జరిగిన బిడ్డింగ్లో ఎల్ అండ్ టీ కూడా పోటీపడింది. కానీ చివరికి ఈ ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టు ఎంఈఐఎల్కు దక్కింది.