1:5గా ఆంధ్రా పేపర్స్ షేర్ల విభజన
ABN , Publish Date - May 16 , 2024 | 05:01 AM
ఆంధ్రా పేపర్స్ తన షేర్లను 1:5గా విభజించాలని నిర్ణయించింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఇందుకు ఆమోదం తెలిపింది. దీంతో రూ.10 ముఖ విలువ ఉన్న ఒక్కో షేరు రూ.2 ముఖ విలువ...
![1:5గా ఆంధ్రా పేపర్స్ షేర్ల విభజన](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హైదరాబాద్ : ఆంధ్రా పేపర్స్ తన షేర్లను 1:5గా విభజించాలని నిర్ణయించింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఇందుకు ఆమోదం తెలిపింది. దీంతో రూ.10 ముఖ విలువ ఉన్న ఒక్కో షేరు రూ.2 ముఖ విలువ ఉండే ఐదు షేర్లుగా మారుతుంది. ఈ షేర్ల విభజన పూర్తయ్యేందుకు నాలుగు నెలలు పడుతుందని కంపెనీ అంచనా. ఈ విభజనతో స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్ల లభ్యత (లిక్విడిటీ) బాగా పెరిగి షేర్లు రిటైల్ ఇన్వెస్టర్లకు కూడా అందుబాటులోకి వస్తాయని అంచనా.