Share News

యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలి

ABN , Publish Date - Jan 11 , 2024 | 11:37 PM

మండలంలోని మాచుపల్లె గ్రామంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా గురువారం సాయంత్రం క్రికెట్‌ టోర్నమెంటు పోటీలను ప్రారంభించారు.

యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలి

చమర్తి జగన్‌మోహన్‌రాజు

సిద్దవటం, జనవరి 11: మండలంలోని మాచుపల్లె గ్రామంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా గురువారం సాయంత్రం క్రికెట్‌ టోర్నమెంటు పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు హాజరై క్రికెట్‌ టోర్నమెంటు పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఉత్సాహంతో క్రికెట్‌ పోటీల్లో పాల్గొని ప్రతిభను కనబరచాలన్నారు. క్రీడలతోనే మానసిక ఉల్లాసం ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్‌ ఇన్‌చార్జి దశరథరామనాయుడు, లక్ష్మీనారాయణనాయుడు, రాజంపేట నియోజకవర్గ యువ నాయకుడు దారపునేని రాజే్‌షనాయుడు, పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు పుత్తా రామచంద్రయ్య, స్థానిక నాయకులు పిచ్చిరెడ్డి, రాజంపేట పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి నాగమునిరెడ్డి, టీడీపీ మండల నాయకుడు మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 11:37 PM