మీ ఓటు దెబ్బకు ఫ్యాను రెక్కలు ఊడిపోవాలి!
ABN , Publish Date - May 09 , 2024 | 03:46 AM
వైసీపీ అరాచకాలు మితిమీరాయి. రాష్ట్రంలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కరువైంది. చివరకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్తో మీ భూ ములకు సైతం జగన్ ఎసరు పెడుతున్నారు.
రాబోయేది చంద్రబాబు పాలనే
రామకుప్పం, కుప్పం రోడ్ షోల్లో నారా భువనేశ్వరి పిలుపు
కుప్పం, మే 8: ‘‘వైసీపీ అరాచకాలు మితిమీరాయి. రాష్ట్రంలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కరువైంది. చివరకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్తో మీ భూ ములకు సైతం జగన్ ఎసరు పెడుతున్నారు. మీరు చంద్రబాబుకు వేసే ఓటు తో ఫ్యాను రెక్కలు ఊడిపోవాలి’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం, రామకుప్పం మండలాల్లో బుధవారం ఆమె ప్రచారంలో పాల్గొని రోడ్ షోలు నిర్వహించారు. భువనేశ్వరి మాట్లాడుతూ.. కుప్పం అభివృద్ధి కోసం చంద్రబాబు ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటించారని తెలిపారు. రాష్ట్రంలో రాబోయేది చంద్రబాబు పాలనేనన్నారు. ‘‘మీకోసం చంద్రబాబు 20 లక్షల ఉద్యోగాలను రాబోయే ఐదేళ్లలో ఇస్తానని వాగ్దానం చేశారు. అది గుర్తుంచుకోండి. ఆయన కోసం మిగిలిన ఈ 4 రోజులు పనిచేయండి’’ అని భువనేశ్వరి పిలుపునిచ్చా రు. ‘‘చివరకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్తో మీ భూములకు కూడా జగన్ ఎసరు పెట్టారు.. జాగ్రత్త’’ అని హెచ్చరించారు. మళ్లీ పొరపాటున వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రజల భూములన్నింటినీ చెరబట్టి, తాకట్టు పెట్టేస్తారని విమర్శించారు. చంద్రబాబును ఈ సారి గెలిపించడం కాదు, లక్ష ఓట్ల మెజారిటీతో విజయాన్ని అందించాలని కోరారు.