18 సార్లు ప్రధానిని కలిశావ్.. ఏం చేశావ్!?
ABN , Publish Date - Mar 16 , 2024 | 02:22 AM
కేంద్రం మెడలు వంచేస్తా.. 25 మంది ఎంపీలను ఇవ్వండి.. అని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి జగన్..
![18 సార్లు ప్రధానిని కలిశావ్.. ఏం చేశావ్!?](https://media.andhrajyothy.com/media/2024/20240313/ff_ca7d7b0600.jpg)
జగన్ మన ఆస్తులు, భూములు కూడా అమ్మేస్తాడు: అయ్యన్న
రాజమహేంద్రవరంసిటీ, మార్చి 15: ‘‘కేంద్రం మెడలు వంచేస్తా.. 25 మంది ఎంపీలను ఇవ్వండి.. అని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి జగన్.. మీ ఎంపీలను వెంటపెట్టుకుని నువ్వు 18 సార్లు ప్రధాని మోదీని కలిశావ్. మరి ఏం పీకావ్?’’ అని రాష్ట్ర మాజీ మంత్రి, టీడీపీ నేత చింతకాయల అయన్నపాత్రుడు సీఎం జగన్ను ప్రశ్నించారు. రాజమహేంద్రవరం రూరల్లో శుక్రవారం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జయహో బీసీ’ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు.