AP Politics: రేపు టీడీపీలో చేరబోతున్న వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ
ABN , Publish Date - Mar 01 , 2024 | 06:37 PM
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలోకి (TDP) అధికార పక్షం వైసీపీ (YSRCP) నుంచి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవలే వైసీపీ రాజీనామా చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీకి గూటికి చేరనున్నారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకోనున్నారు. మరోవైపు నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కుటుంబ సభ్యులు, అనుచరులు తెలుగుదేశంలో చేరనున్నారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలోకి (TDP) అధికార పక్షం వైసీపీ (YSRCP) నుంచి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవలే వైసీపీ రాజీనామా చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీకి గూటికి చేరనున్నారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకోనున్నారు.
హైదరాబాద్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరనున్నారు. ఇక నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కుటుంబ సభ్యులు, అనుచరులు తెలుగుదేశంలో చేరనున్నారు. మధ్యాహ్నం గురజాలలో జరగనున్న ‘ రా కదలిరా బహిరంగ సభ’లో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు కూడా విపక్ష పార్టీలో చేరనున్నారు. కాగా ఈ ముగ్గురు కీలక నేతలు వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.