Share News

వైసీపీ నాయకులు దోచుకుంటున్నారు : ఎమ్మార్పీఎస్‌

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:47 PM

మండలంలోని వైసీపీ నాయకులు కాంట్రాక్టు పేరుతో అక్రమాలకు పాల్పడుతూ దోచుకుంటున్నారని ఎమ్మార్పీఎస్‌ జిల్లా అఽధ్యక్షుడు పారా రాఘవేంద్ర ఆరోపించారు.

వైసీపీ నాయకులు దోచుకుంటున్నారు : ఎమ్మార్పీఎస్‌

మద్దికెర, ఏప్రిల్‌ 30: మండలంలోని వైసీపీ నాయకులు కాంట్రాక్టు పేరుతో అక్రమాలకు పాల్పడుతూ దోచుకుంటున్నారని ఎమ్మార్పీఎస్‌ జిల్లా అఽధ్యక్షుడు పారా రాఘవేంద్ర ఆరోపించారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ మద్దికెర గ్రామంలోని వైసీపీ నాయకులు కాంట్రాక్టుల పేరుతో నాసిరకం పనులు చేస్తూ దోచుకుంటున్నారనీ ఆరో పించారు. మద్దికెర నుంచి బురుజుల గ్రామానికి ప్రభుత్వం రూ.30 లక్షల కు పైగా రోడ్డుకు మరమ్మతులు పనులు చేసేందుకు నిధులు మంజూరు చేస్తే తూతూ మంత్రంగా పనులు చేసి దోచుకున్నారనీ ఆరోపించారు. అంతేగాక మండలంలో జరిగిన సీసీ రోడ్ల పనుల్లో కూడా అవినీతికి పాల్పడుతున్నారన్నారు. సాయినగర్‌, రామ్‌నగర్‌ కాలనీలో వేసిన రోడ్లు కూడా నాసిరకంగా ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ఎం.అగ్రహారం ఆనంద్‌ కుమార్‌, పెడవలి రాము, తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 11:47 PM