వైసీపీ.. ప్రజాభిమానాన్ని కోల్పోయింది
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:16 PM
వైసీపీ ప్రభుత్వం ప్రజాభిమా నాన్ని కోల్పోయిందని బీజేపీ జాతీయ కార్యదర్శి, అండమాన్ నికోబార్ ఇన్చార్జ్, ఉత్తరప్రదేశ్ సహ ఇన్చార్జ్ వై.సత్యకు మార్ తెలిపారు.
![వైసీపీ.. ప్రజాభిమానాన్ని కోల్పోయింది](https://media.andhrajyothy.com/media/2023/20231205/9_KDR_12_jpeg_b3f027d068.gif)
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్
అట్టహాసంగా బీజేపీ కార్యాలయం ప్రారంభం
రైల్వేకోడూరు, జనవరి 12: వైసీపీ ప్రభుత్వం ప్రజాభిమా నాన్ని కోల్పోయిందని బీజేపీ జాతీయ కార్యదర్శి, అండమాన్ నికోబార్ ఇన్చార్జ్, ఉత్తరప్రదేశ్ సహ ఇన్చార్జ్ వై.సత్యకు మార్ తెలిపారు. శుక్రవారం రైల్వేకోడూరు మండలంలోని మైసూరివారిపల్లె ప్రధానదారిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పనతల సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ అరాచకాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని, ప్రజా వ్యతిరేక కార్య క్రమాలతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిందన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కబ్జాల పర్వంగా మంత్రులు, ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారని తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డిలు వందలాది ఎకరాలను కబ్జా చేశారని ఆరోపించారు. తిరుపతిలోని స్విమ్స్కు సంబంధించిన వాటాదారుల ద్వారా వైవీ సుబ్బారెడ్డి కుమారుడు రూ.50 లక్షలకు పైగా ఆదా యాన్ని పొందుతున్నారని విమర్శించారు. శిల్పారామంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమార్తె నెలకు రూ.12 లక్షలు ఆదాయాన్ని పొందుతోందని, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి శేషాచల అడవులను దోచుకు తింటున్నారని విమర్శించారు. ఈ విషయాలన్నీ ఏపీ ప్రజలు గమనించాల న్నారు. రానున్న రోజుల్లో జగన్ మాజీ సీఎంగా మిగిలిపో తారన్నారు. మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఆదినారా యణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకాలు మితిమీరిపో తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భూహక్కు చట్టం వైసీపీ నాయకులు, కార్యకర్తలకు మేలు చేస్తుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిలోకేశ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు జగన్ బొమ్మ పెట్టుకుందన్నారు. బీజేపీ అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలను కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లా లన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పనతల సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కబ్జాలు, కుంభకోణాలు, అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ వైసీపీ ప్రభు త్వాన్ని చూసి ప్రజలు విసిగిపోయారని తెలి పారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్నాయుడు, బీజేపీ రైల్వే కోడూరు అసెంబ్లీ కన్వీనర్ గడ్డం చంగ ల్రాజు, జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షుడు దాసర్రాజు జయప్రకాష్ నారాయణవర్మ, బీజేపీ జిల్లా ఇన్చార్జ్ చంద్రమౌళి, మైసూరివారిపల్లె సర్పంచ్ కారుమంచి సంయుక్త, స్థానిక నాయకులు చక్రవర్తుల నాగేశ్వర్రాజు, వాకచర్ల సుబ్బారావు, గౌరీకుమార్, జోగినేని సుబ్బారావు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.