టీడీపీ వర్గీయులపై వైసీపీ మూకల దాడి
ABN , Publish Date - Jun 09 , 2024 | 03:05 AM
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడంపై ప్రశ్నించారని టీడీపీ వర్గీయులపై వైసీపీ మూకలు దాడి చేశాయి. పల్నాడు జిల్లా ఈపూరు మండలం బొమ్మరాజుపల్లిలో శనివారం ఈ దారుణం జరిగింది.
![టీడీపీ వర్గీయులపై వైసీపీ మూకల దాడి](https://media.andhrajyothy.com/media/2024/20240604/il_d1117d2bf1.jpg)
పల్నాడు జిల్లా బొమ్మరాజుపల్లిలో ఉద్రిక్తత
బొమ్మరాజుపల్లి(ఈపూరు), జూన్ 8: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడంపై ప్రశ్నించారని టీడీపీ వర్గీయులపై వైసీపీ మూకలు దాడి చేశాయి. పల్నాడు జిల్లా ఈపూరు మండలం బొమ్మరాజుపల్లిలో శనివారం ఈ దారుణం జరిగింది. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సుబ్రహ్మణ్యం టీడీపీ నేతలను దూషిస్తూ అసభ్యకర పోస్టులు పెట్టాడు. గ్రామంలోని టీడీపీ వర్గీయులు అతన్ని దీనిపై ప్రశ్నించగా వాగ్వాదం నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. మధ్యాహ్నం టీడీపీకి చెందిన చల్లా అంకారావు, వీర్ల కోటేశ్వరరావు రైస్ మిల్లుకు వెళ్తుండగా వైసీపీకి చెందిన కొందరు దాడి చేసి గాయపరిచారు. బాధితులను ఈపూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ తర్వాత గ్రామంలో ఇరువర్గాలు రాళ్ల దాడికి దిగాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.