Share News

వైసీపీ తుది జాబితా నేడే!

ABN , Publish Date - Mar 16 , 2024 | 02:26 AM

సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే వైసీపీ అభ్యర్థుల తుది జాబితాను సీఎం జగన్‌ శనివారం ప్రకటించే వీలుంది.

వైసీపీ తుది జాబితా నేడే!

నేడు ఇడుపులపాయలో అభ్యర్థులను ప్రకటించనున్న జగన్‌!!

పులివెందుల రూరల్‌, మార్చి 15: సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే వైసీపీ అభ్యర్థుల తుది జాబితాను సీఎం జగన్‌ శనివారం ప్రకటించే వీలుంది. ఆయన శనివారం మధ్యాహ్నం 12.05 గంటలకు కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 12.30కు ఇడుపులపాయ హెలిప్యాడ్‌లో దిగుతారు. రోడ్డు మార్గాన 12.40 గంటలకు వైఎస్సార్‌ ఘాట్‌ చేరుకుంటారు. తండ్రి రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ సందర్భంగా అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల తుది జాబితాను విడుదలచేసే వీలుందని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. 1.25 గంటలకు గెస్ట్‌హౌ్‌సకు చేరుకుంటారు. 1.45 గంటలకు కడప విమానాశ్రయానికి బయల్దేరతారు. 2.15 గంటలకు విమానంలో గన్నవరం వెళ్తారు.

Updated Date - Mar 16 , 2024 | 08:16 AM