మల్లన్న సన్నిధిలోనూ వైసీపీ ప్రచారం!
ABN , Publish Date - Mar 26 , 2024 | 03:39 AM
శివనామస్మరణ చేయాల్సిన మల్లన్న సన్నిధిలో.. వైసీపీ కార్యకర్త ఒకరు జగన్ పాటకు స్టెప్పులు వేయడం వివాదస్పదమయ్యింది.
![మల్లన్న సన్నిధిలోనూ వైసీపీ ప్రచారం!](https://media.andhrajyothy.com/media/2024/20240322/44_41caae965b.jpg)
శ్రీశైలం, మార్చి 25: శివనామస్మరణ చేయాల్సిన మల్లన్న సన్నిధిలో.. వైసీపీ కార్యకర్త ఒకరు జగన్ పాటకు స్టెప్పులు వేయడం వివాదస్పదమయ్యింది. ఆదివారం అర్ధరాత్రి స్థానిక వైసీపీ కార్యకర్త ఆవులపాటి హిమకాంత్ సెల్ఫోన్లో జగన్ పాట పెట్టి బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చాడు. దానికి స్పీకర్లు పెట్టి రోడ్డుపైనే ఓ మహిళతో కలిసి స్టెప్పులు వేశాడు. దానిని వీడియో తీసి..తన ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకున్నాడు. దేవస్థానం విరాళాల కేంద్రం పక్కన రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది చూసిన భక్తులు విస్మయానికి గురయ్యారు.