Share News

మహిళా సంక్షేమం టీడీపీతోనే సాధ్యం

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:23 AM

రాష్ట్రంలో మహిళా సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు అన్నారు.

మహిళా సంక్షేమం  టీడీపీతోనే సాధ్యం
హోసూరులో బాబుష్యూరిటీ భవిష్యత్‌ కార్యక్రమంలో కేఈ

హోసూరు, దూదెకొండ గ్రామాల్లో కేఈ ప్రచారం

జిల్లా వ్యాప్తంగా సూపర్‌ సిక్స్‌ పథకాలపై అవగాహన

పెండేకల్‌, మద్దికెర గ్రామాల్లో టీడీపీ నాయకుల ఇంటింటి ప్రచారం

పత్తికొండ , మార్చి 11 : రాష్ట్రంలో మహిళా సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు అన్నారు. బాబుష్యూరిటీ భవిష్యత్‌గ్యారంటీ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో పర్యటించి ఆ పార్టీ అధికారం చేపట్టాక అమలు చేయబోయే మినీ మేనిఫెస్టోలోని సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఇందులో భాగంగా కేఈ శ్యాంబాబు పత్తికొండ మండలం హోసూరు, దూదెకొండ గ్రామాల్లో పర్యటించి మినీమేనిఫెస్టో సూపర్‌సిక్స్‌ పథకాల గురించి ప్రజలకు వివరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సుప్రయాణం, 18 ఏళ్లు నిండిన ప్రతిఆడబిడ్డకు నెలకు రూ1,500, దీపం పథకం కింద ఉచితంగా మూడు సిలండర్లు, తల్లికివందనం పేరిట చదువుకునే ప్రతివిద్యార్థికి రూ 15,000 నగదు, 20లక్షలమంది యువతకు ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగ యువతకు రూ 3,000 నిరుద్యోగభృతి వంటి ఎన్నో పథకాలు అమలవుతాయన్నారు. ఆయనతోపాటు టీడీపీ నాయకులు సాంబశివారెడ్డి, ప్రమోద్‌కుమార్‌రెడ్డి, రామానాయుడు, వాకిటిశ్రీనివాసులు, గుడిసెనరసింహులు, జగ్గిలిఅంజి, రాఘవేంద్రలతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అంకాలమ్మకు పూజలు: పత్తికొండ పట్టణ గ్రామదేవతలు అంకాలమ్మ, బంగారమ్మదేవాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు సోమవారం ప్రత్యేకపూజలు నిర్వహించారు. దేవాలయానికి సంబంధించి నూతనంగా నిర్మించిన ఆర్చీ ప్రారంభోత్సవానికి హాజరై ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికి పూజలనంతరం శాలువాతో సత్కరించారు.

వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయి

తుగ్గలి : వైసీపీ ప్రభుత్వ అక్రమ పాలనకు అంతమయ్యేందుకు రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ మాజీ మండల కన్వీనర్‌ వీరభద్రప్ప అన్నారు. పెండేకల్‌లో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. జగన్‌ రాష్ట్రాన్ని మరో 20 ఏళ్లు వెనక్కు నెట్టారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. టీడీపీ నాయకులు రాజు, మల్లి, నాయుడు, తదితరులు ఉన్నారు.

సీఎం జగన్‌ రాష్ట్రానికి పట్టిన శని

మద్దికెర : సీఎం జగన్‌ రెడ్డి రాష్ట్రానికి పట్టిన శని అని పత్తికొండ టీడీపీ అధ్యక్షుడు గడ్డం రామాంజులు, ఎస్సీ సెల్‌ నాయకులు పారా విఠోబ అన్నారు. మద్దికెర గ్రామంలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రతి రోజూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ సూపర్‌సిక్స్‌ పథకాలతో మరింత ముందుకు వెళ్తుందన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొల్లాపురం చంద్ర, సాయినగర్‌ బాషా, టైలర్‌ మాస్టర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 12:23 AM