చంద్రబాబుతోనే రాషా్ట్రభివృద్ధి.. సంక్షేమం
ABN , Publish Date - Apr 06 , 2024 | 11:26 PM
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతోనే రాషా్ట్రభివృద్ధి, సంక్షేమం సాధ్యమని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి దాసరిపల్లి జయ చంద్రారెడ్డి పేర్కొన్నారు.
![చంద్రబాబుతోనే రాషా్ట్రభివృద్ధి.. సంక్షేమం](https://media.andhrajyothy.com/media/2024/20240326/6mpl_mcu1_f6681a17fc.gif)
ఏప్రిల్ నుంచి అవ్వాతాతలకు రూ.4వేలు పెన్షన
తంబళ్లపల్లె ఉమ్మడి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి
ములకలచెరువు, ఏప్రిల్ 6: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతోనే రాషా్ట్రభివృద్ధి, సంక్షేమం సాధ్యమని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి దాసరిపల్లి జయ చంద్రారెడ్డి పేర్కొన్నారు. మండలం లోని కోనేటివారిపల్లె పంచాయతీ ఏ సువారిపల్లె, కోనేటివారిపల్లె, ఏడుమ డకలపల్లె, రాయపువారిపల్లె, రామా కులపల్లె, తంబళ్లవారిపల్లె, సోంపాళ్యం తదితర గ్రామాల్లో బాబు ష్యూరిటీ .. భవిష్యత్తు గ్యారంటీ పథకాలు, విజయ సంకల్ప ప్రచార యాత్రలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే ఏప్రిల్ నెల నుంచే పెన్షన లబ్ధిదారులకు రూ.4వేలు పెన్షనను నేరుగా ఇంటి వద్దకే వచ్చి అందిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారన్నారు. ఒక్క అవకాశమిస్తే తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపి స్తానన్నారు. కార్యక్రమాల్లో టీడీపీ మండల అధ్యక్షుడు పాలగిరి సిద్ధా, జనసేన ఇనచార్జి పోతుల సాయినాధ్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు కువైట్ శంకర్, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు చెన్నకిష్టా, మాజీ సర్పంచ యర్రగుడి సురేష్, నేతలు కేవీ రమణ, నాయ కులు ఉమాశంకర్, ప్రతాప్, రమణారెడ్డి, పాలరాము, వెంకటసిద్ధయ్య, శివన్న, మెకానిక్ హరి, సోమశేఖర్, శివ, ఆంజనేయరెడ్డి, రంగాళ్ళ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.