‘ఎసెన్షియా’పై నివేదికను తొక్కిపెట్టావెందుకు ?
ABN , Publish Date - Aug 24 , 2024 | 05:20 AM
గతేడాది చివర్లో అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా నిర్వాహకాలను ఓ రిపోర్టు బయట పెట్టిందని, ఎన్నో ప్రమాదాలపై హెచ్చరికలు జారీ చేసిందని,
కార్మికుల ప్రాణాలు పట్టవా?.. జగన్ను నిలదీసిన వైఎస్ షర్మిల
అమరావతి, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): గతేడాది చివర్లో అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా నిర్వాహకాలను ఓ రిపోర్టు బయట పెట్టిందని, ఎన్నో ప్రమాదాలపై హెచ్చరికలు జారీ చేసిందని, అయినా వైసీపీ ప్రభుత్వం ఆ నివేదికను ఎందుకు తొక్కిపెట్టిందని వైసీసీ అధ్యక్షుడు జగన్ను ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల నిలదీశారు. శుక్రవారం ఆమె ‘ఎక్స్’ వేదికగా.. పలు అంశాలను ప్రస్తావించారు. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే నివేదిక వచ్చినా కార్మికుల భద్రతను గాలికొదిలేసి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కంపెనీకి పాతిక కిలోమీటర్ల దూరంలో కొండను పిండిచేసి రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకోవడానికి డబ్బూ, తీరిక ఉంటాయా? కార్మికుల ప్రాణాలు పట్టవా? అంటూ జగన్ను నిలదీశారు. తక్షణమే ఎసెన్షియా ఫార్మాను సీజ్ చేయాలని కూటమి సర్కారుకు షర్మిల విజ్ఞప్తి చేశారు.