Share News

పూలే ఆశయ సాధనకు కృషి చేస్తాం

ABN , Publish Date - Apr 12 , 2024 | 01:09 AM

సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే గారి ఆశయ సాధన కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కునిగిరి నీలకంఠ, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మలేకర్‌ శ్రీనివాసులు, ఆదోని అసెంబ్లీ కో-కన్వీనర్‌ నాగరాజు గౌడ్‌ అన్నారు.

పూలే ఆశయ సాధనకు కృషి చేస్తాం

ఆదోని టౌన్‌ : సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే గారి ఆశయ సాధన కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కునిగిరి నీలకంఠ, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మలేకర్‌ శ్రీనివాసులు, ఆదోని అసెంబ్లీ కో-కన్వీనర్‌ నాగరాజు గౌడ్‌ అన్నారు. గురువారం పూలే జయంతి సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు సాయికుమార్‌ ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అలాగే బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బోయ నీలకంఠప్ప, ప్రధాన కార్యదర్శి ఎండీ బసవరాజు స్వామి, పూలే జయంతి నిర్వహించారు. బీసీ నాయకులు సాయినాథ్‌, పాల్గొన్నారు.

గోనెగండ్ల/పత్తికొండ/ఆదోని అర్బన్‌: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే అందరికి ఆదర్శమని కేవీపీఎస్‌ జిల్లా ఉపాఽధ్యక్షుడు కరుణాకర్‌ అన్నారు. గురువారం పూలే జయంతి నిర్వహించి ఘన నివాళి అర్పించారు. పత్తికొండలో పత్తికొండ బీజేపీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సీసీ రంగన్న, గోవర్దన్‌ నాయుడు ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆదోనిలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో బల్లేకల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యన్న, రాష్ట్ర కౌన్సిలర్‌ మహాదేవప్ప అదనపు ప్రధాన కార్యదర్శి సుంకన్న పూలేకు ఘన నివాళి అర్పించారు.

Updated Date - Apr 12 , 2024 | 07:17 AM