Share News

బార్‌ అభివృద్ధికి కృషి చేస్తాం

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:06 AM

ఆదోని బార్‌ అసొసియేషన్‌ అభివృద్ధి కోసం కృషి చేస్తామని నూతన కమిటీ అధ్యక్షుడు ఎల్‌.కె. సుందర్‌ సింగ్‌, ఉపాధ్యక్షులు ఎం.జనార్దన్‌ తెలిపారు.

బార్‌ అభివృద్ధికి కృషి చేస్తాం

ఉత్కంఠ పోరులో సుందర్‌ సింగ్‌ ప్యానల్‌ గెలుపు

ఆదోని రూరల్‌, మార్చి 27 : ఆదోని బార్‌ అసొసియేషన్‌ అభివృద్ధి కోసం కృషి చేస్తామని నూతన కమిటీ అధ్యక్షుడు ఎల్‌.కె. సుందర్‌ సింగ్‌, ఉపాధ్యక్షులు ఎం.జనార్దన్‌ తెలిపారు. బుధవారం స్థానిక బార్‌రూంలో నూతన కమిటీకి ఎన్నికలు జరిగాయి. మొత్తం 263 ఓట్లు ఉండగా, 236మంది ఓటును వినియోగించుకున్నారు. అధ్యక్ష బరిలో ఉన్న ఎల్‌.కె.సుందర్‌ సింగ్‌కు 141, అనీతా బాయికి 95, ఉపాధ్యక్ష బరిలో ఉన్న జనార్దన్‌కు 159, తాయన్నకు 77, సెక్రటరీ బరిలో ఉన్న సురేంద్ర కుమార్‌కు 144, లోకేష్‌ కుమార్‌కు 92, ట్రెజరర్‌ బరిలో ఉన్న మహ్మద్‌ లతీఫ్‌ ఆహ్మద్‌కు 151, అబ్దుల్‌ రహీం అన్సారీకి 81 ఓట్లు పోలయ్యాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు పోలింగ్‌ జరిగింది. ఈ ఉత్కంఠ పోరులో సుందర్‌ సింగ్‌ ప్యానల్‌ ఘన విజయం సాధించింది. బార్‌ అభివృద్ధికి కృషి చేస్తామని, ప్రతి న్యాయవాది సమస్యలను పరిష్కరించడానికి తమవంతు పాటు పడుతామని పేర్కొన్నారు. తమకు ఓటేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Updated Date - Mar 28 , 2024 | 12:06 AM