Share News

కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటాం : తిక్కారెడ్డి

ABN , Publish Date - Feb 20 , 2024 | 12:36 AM

మంత్రాలయంలో టీడీపీ కార్యకర్త కరణం రామారావు కుమారుడు కరణం రమేష్‌ (24) మృతి చెందడం పార్టీకి తీరనిలోటని, వారి కుటుంబానికి అండగా ఉంటామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు.

 కార్యకర్త  కుటుంబానికి అండగా ఉంటాం : తిక్కారెడ్డి

మంత్రాలయం, ఫిబ్రవరి 19: మంత్రాలయంలో టీడీపీ కార్యకర్త కరణం రామారావు కుమారుడు కరణం రమేష్‌ (24) మృతి చెందడం పార్టీకి తీరనిలోటని, వారి కుటుంబానికి అండగా ఉంటామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. సోమవారం రమేష్‌ మృతి విషయం తెలుసుకున్న తిక్కారెడ్డి రమేష్‌ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళి అర్పించి రమేష్‌ కుటుంబాన్ని ఓదార్చారు. కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ పన్నగ వెంకటేశ్‌, పూజారి వ్యాసరాజాచార్‌, గోపాలకృష్ణ స్వామి, అశోక్‌ రెడ్డి, విజయరామిరెడ్డి, గుర్రాజు శెట్టి, యేబు, రవి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 12:36 AM