Share News

జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం

ABN , Publish Date - Feb 25 , 2024 | 11:45 PM

అవినీతి, అరాచక పాలనను సాగిస్తున్న జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాబురావు అన్నారు.

జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం

కాంగ్రెస్‌ ఫార్టీ జిల్లా అధ్యక్షుడు బాబురావు

ఆలూరు/ ఆదోని టౌన్‌ ఫిబ్రవరి 25: అవినీతి, అరాచక పాలనను సాగిస్తున్న జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాబురావు అన్నారు. ఆదివారం ఆలూరు అర్‌అండ్‌బీ అతిథి గృహంలో, ఆదోని పార్టీ కార్యాలయంలో జరిగిన వేర్వేరు సమావేశాల్లో ఆయన మాట్లాడారు. వైసీపీ కేంద్రంతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్న కారణంగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా, నిరుద్యోగం పోవాలన్నా, ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా, ప్రత్యేక హోదా రావాలన్నా కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. 26వ తేదీన అనంతపురంలో జరిగే రాష్ట్ర పునః నిర్మాణ పోరాట సభకు కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి చిప్పగిరి లక్ష్మినారాయణ, ఆదోని నియోజకవర్గ బాధ్యుడు నీలకంఠప్ప, యువజన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీరావు, జిల్లా ఉపాధ్యక్షుడు దిలీప్‌ ధోకా, జిల్లా కార్యదర్శి క్రాంతినాయుడు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 11:45 PM