వికసిత్ ఆంధ్రా-2047 డాక్యుమెంట్ అద్భుతం: సీఎస్
ABN , Publish Date - Feb 29 , 2024 | 03:31 AM
ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వికసిత్ ఆంధ్రా-2047పై నీతి ఆయోగ్ రూపొందించిన విజన్ డాక్యుమెంట్ అద్భుతంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి అన్నారు. బుధవారం అమరావతి
అమరావతి, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వికసిత్ ఆంధ్రా-2047పై నీతి ఆయోగ్ రూపొందించిన విజన్ డాక్యుమెంట్ అద్భుతంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి అన్నారు. బుధవారం అమరావతి సచివాలయంలో వికసిత్ ఆంధ్రా-2047పై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా సీఎస్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు అవుతున్న సందర్భంగా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్ధే లక్ష్యంలో ఏపీని కూడా 2047నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే కృషికి ఈ విజన్ డాక్యుమెంట్ దోహదపడుతుందన్నారు. పరిశ్రమలు, ఇంధన, వ్యవసాయ, మౌలిక సదుపాయాలు, సేవలు, గ్రీన్ ఎకానమీ నగరాల అభివృద్ధి వంటి అంశాల్లో రాష్ట్రాభివృద్ధికి ఈ డాక్యుమెంట్ అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దేశంలో రెండో పెద్ద తీరప్రాంతాన్ని కలిగిన ఏపీలో ఓడరేవులతో పాటు పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. ఈ డాక్యుమెంట్పై సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చి, దీని అమలుకు ఆమోదం తీసుకోనున్నట్టు వివరించారు.