జేఈఈ మెయిన్స్లో ‘విజ్ఞాన్’ విజయదుందుభి
ABN , Publish Date - Apr 26 , 2024 | 04:15 AM
జేఈఈ మెయిన్ ఫలితాల్లో అఖిల భారతస్థాయిలో విజ్ఞాన్ విద్యార్థులు విజయ దుందుభి మోగించారని విజ్ఞాన్ విద్యాసంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్ తెలిపారు.
గుంటూరు(విద్య), ఏప్రిల్ 25: జేఈఈ మెయిన్ ఫలితాల్లో అఖిల భారతస్థాయిలో విజ్ఞాన్ విద్యార్థులు విజయ దుందుభి మోగించారని విజ్ఞాన్ విద్యాసంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్ తెలిపారు. వడ్లమూడిలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరిగిన అభినందన కార్యక్రమంలో మాట్లాడుతూ తమ వద్ద ఐఐటీ మెయిన్స్ కోచింగ్ తీసుకున్న విద్యార్థులలో 50 శాతం మంది విద్యార్థులు 90 శాతం పర్సంటైల్ సాధించారన్నారు. ఐ.హనీత్ (99.67), ఎం.ేస్నహ (99.46), బి.యోగ విజయ కుమార్ (99.30), ఎ.రోహన్ (98.69), కె.లీలావతి (98.30), వి.అభిరామ్ (96.87), కె.శివనాగ రాజు (96.47), టి.సంజయ్ తేజ (96.41), పి.గౌతమ్ (96.03), ఎం.వివేక్ పూజిత్ కుమార్ (95.72) ఉత్తమ పర్సంటైల్తో రాణించారన్నారు. కార్యక్రమంలో వడ్లమూడి విజ్ఞాన్ జూనియర్ కళాశాల, గుంటూరులోని మహిళా కళాశాల ప్రిన్సిపాల్స్ జె.మోహనరావు, వై.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. విద్యార్థులకు సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య శుభాకాంక్షలు తెలిపారు.