అసంఘటిత కార్మికులను ఆదుకోవాలి
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:36 AM
వ్యవసాయం, భవన నిర్మాణంపై ఆధారపడి జీవిస్తున్న అసంఘటిత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ, సీఐటీయూ నాయకులు డిప్యూటి తహసీల్దార్ బాలాంజనేయులుకు గురువారం వినతిపత్రాన్ని అందజేశారు.
కొత్తచెరువు, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): వ్యవసాయం, భవన నిర్మాణంపై ఆధారపడి జీవిస్తున్న అసంఘటిత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ, సీఐటీయూ నాయకులు డిప్యూటి తహసీల్దార్ బాలాంజనేయులుకు గురువారం వినతిపత్రాన్ని అందజేశారు. కరెంటు చార్జీలు పెంచబోమని.. పెరిగిన ధరలను తగ్గిస్తామని.. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి నాయకులు.. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని తుంగలో తొక్కి.. చార్జీలు పెంచడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టీఎస్ వెంకటేశ, సీపీఐ నాయకులు బ్యాళ్ల అంజి, ముత్యాలు, శంకరరెడ్డి, ఐద్వా నేత నాగమణి పాల్గొన్నారు.