27 మంది అడిషనల్ ఎస్పీల బదిలీ
ABN , Publish Date - Feb 01 , 2024 | 02:54 AM
రాష్ట్రవ్యాప్తంగా 27 మంది అడిషనల్ ఎస్పీలను హోంశాఖ బదిలీ చేసింది.
![27 మంది అడిషనల్ ఎస్పీల బదిలీ](https://media.andhrajyothy.com/media/2023/20231205/mm_4f490a0405.jpg)
అమరావతి, జనవరి 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 27 మంది అడిషనల్ ఎస్పీలను హోంశాఖ బదిలీ చేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఉమ్మడి జిల్లాలో మూడేళ్లు పనిచేసినవారిని పోలీసుశాఖ మరో జిల్లాకు పంపింది. ఏ ఒక్కరినీ సొంత జిల్లాలో లేకుండా జాగ్రత్త పడింది. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల విభాగంతోపాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సిటీ టాస్క్ఫోర్స్లో పనిచేసిన కనకరాజును మరోసారి విజయవాడలోనే అడిషనల్ డీసీపీ(శాంతిభద్రతలు)గా నియమించడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. బదిలీ అయిన వారిలో శాంతిభద్రతల విభాగం నుంచి 21మంది, ఆర్మ్డ్ రిజర్వ్కు చెందిన ఆరుగురు ఉన్నారు.