Share News

21 మంది ఐఏఎస్‌ల బదిలీ

ABN , Publish Date - Jan 29 , 2024 | 02:13 AM

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌. జవహర్‌రెడ్డి ఉత్తర్వులు ఆదివారం జారీ చేశారు.

21 మంది ఐఏఎస్‌ల బదిలీ

3 జిల్లాల కలెక్టర్లకు స్థానచలనం

జాబితాలో ఏడుగురు జేసీలూ...

తిరుపతి కలెక్టర్‌గా లక్ష్మీషా

ప్రకాశం జేసీ శ్రీనివాసులుకు నంద్యాల కలెక్టర్‌గా పోస్టింగ్‌

సీఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు

అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌. జవహర్‌రెడ్డి ఉత్తర్వులు ఆదివారం జారీ చేశారు. ఒకేచోట మూడేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న అధికారులను ఈ నెలాఖరులోగా బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశించిన మేరకు ప్రభుత్వం 21మంది ఐఏఎస్‌ అధికారులకు స్థానచలనం కలిగించింది. శ్రీకాకుళం, నంద్యాల, తిరుపతి జిల్లాల కలెక్టర్లను, నెల్లూరు, ప్రకాశం, విశాఖ, విజయనగరం, కాకినాడ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల జేసీలను, నూజివీడు, విజయవాడ సబ్‌కలెక్టర్లతో పాటు పలువురు అధికారులను బదిలీ చేశారు. అన్నమయ్య కలెక్టర్‌గా ఆర్థికశాఖ జాయింట్‌ సెక్రటరీగా పనిచేస్తున్న ముట్టింబాకు అభిషిక్త్‌ కిశోర్‌ను నియమించారు.

Updated Date - Jan 29 , 2024 | 02:13 AM